వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత

-

టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ బాబు ఈరోజు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆయన్ని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఈ చేరికలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యలమంచిలి, పెందుర్తి నుంచి రమేష్‌బాబు గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

కొన్ని నెలల క్రితమే టిడిపికి రాజీనామా చేసిన రమేష్ బాబు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇదే జిల్లాకు చెందిన గంటా కూడా వైకాపాలో చేరేందుకు రెడీ అయినా ఎందుకో మరి ఇంకా చేరలేదు. ఆ పార్టీకి చెందిన ఎంపీ విజయ సాయి రెడ్డితో పాటు ఒకప్పటి తన అనుచరుడు ఇప్పటి మంత్రి అవంతి శ్రీనివాస్‌ లు గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో గంటా చేరిక అయోమయంలో పడింది. ఆయన చేరతారా లేదా ? అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version