కడపలో టీడీపీ నేత దారుణ హత్య.. పేదలకి ఇచ్చే ఇళ్ళ స్థలాల్లోనే !

-

కడప జిల్లా ప్రొద్దుటూరులో టిడిపి నేత నందం సుబ్బయ్య దారుణ హత్యకు గురయ్యాడు. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే స్థలంలోనే సుబ్బయ్యని దుండగులు నరికి చంపారు. ప్రస్తుతం సుబ్బయ్య కడప జిల్లా టిడిపి అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. సుబ్బయ్య కళ్లలో కారం కొట్టి మరీ దుండగులు నరికి చంపడం సంచలనంగా మారింది.

గత కొద్ది రోజులుగా సుబ్బయ్య సోషల్ మీడియాలో వైసిపికి అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన హత్యకు గురవడంతో ఇది అధికార పార్టీ వారి పనే అని తెలుగుదేశం పార్టీ వారు ఆరోపిస్తున్నారు. దీనికి సంబందించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కడప జిల్లా సోములవారిపల్లెలోని ప్రభుత్వం పేదలకు ఇళ్ళ స్థలాలు అలాట్ చేసిన చోట ఆయన శవం పడి ఉంది. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version