జగన్ గారూ… మీరు వాళ్ళ మాటలు విని పాడైపోతున్నారు: టీడీపీ నేత

-

ముఖ్యమంత్రి గారూ మీ ప్రభుత్వానికి “దళిత వ్యతిరేకి” అనే ముద్ర పడకుండా చూసుకోండి అంటూ టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సిఎం జగన్ కు సూచించారు. వెంటనే శిరో ముండన కేసులో అసలు ముద్దాయి ని అరెస్ట్ చేయండని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. మీ సలహా దారుల మాటలు వినకoడన్నారు ఆయన. నా సలహా మాత్రమే విని అతన్ని అరెస్టు చేసి మీ ప్రభుత్వ గౌరవం కాపాడుకోండని సూచించారు.

లేదా దళిత ద్రోహిగా మిగిలి పోతారని హెచ్చరించారు. బాధితుడికి న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అధికార పార్టీ వైసీపీ నాయకులు, పోలీసులు కుమ్మక్కై దళిత యువకుడు వరప్రసాద్ ను అవమానించాలని శిరోముండనం చేశారని అయన తీవ్ర విమర్శలు చేసారు. ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక ఎస్సై పై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం తప్పా ప్రభుత్వం అసలు నిందితులను వదిలిపెట్టిందని పేర్కొన్నారు. న్యాయం చేయడంలో వ్యవస్థలు విఫలమైనప్పుడు వరప్రసాద్ లాంటి యువకులు సహజంగా తీవ్రవాద ఉద్యమాల వైపు చూస్తారని అయన ఆవేదన వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version