BREAKING : ఏపీ స్పీకర్‌కు టీడీపీ ఎమ్మెల్యేల లేఖ..

-

ఆంధ్ర ప్రదేశ్‌ స్పీకర్ తమ్మినేని సీతారాంకు టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. పెగాసెస్ అంశంపై సభలో చర్చించడం సరికాదంటూ టీడీపీ ఎమ్మెల్యేల అభ్యంతరం వ్యక్తం చేస్తూ…ఈ లేఖ రాశారు. పెగాసెస్ స్పై వేర్ ను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేదని మాజీ డీజీపీ సవాంగ్ స్పష్టం చేశారని.. లేఖలో టీడీపీ ఎమ్మెల్యేలు వివరించారు.

ycp-tdp

అవాస్తవాల పై సభలో చర్చించడం విడ్డూరంగా ఉందని ఫైర్ అయ్యారు.. గతంలో ఇదే పెగాసెస్ అంశంపై లోక్ సభలో చర్చ అవసరం లేదని గతంలో విజయసాయి రెడ్డే చెప్పారని గుర్తు చేశారు. వివేకా హత్య, డీఎస్పీల ప్రమోషన్ల విషయంలో తప్పుడు ప్రచారం చేయడానికి సభని వేదికగా చేసుకుంటున్నారని.. సభ గౌరవం కాపాడాలని లేఖలో టీడీపీ ఎమ్మెల్యేలు కోరారు. అయితే.. దీనిపై ఏపీ స్పీకర్‌ తమ్మినేని మాత్రం స్పందించలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version