బ్రేకింగ్ : దుబ్బాక ఉపఎన్నికల్లో పోటీ చేసే యోచనలో టిడిపి

-

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పూర్తిగా ఏపీ రాజకీయాలకే అంకితమైపోవడంతో తెలంగాణాలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. మధ్య మధ్య లో ఆయన తెలంగాణ టీడీపీకి చెందిన శ్రేణులతో సమావేశాలు పెట్టి తెలంగాణలో పార్టీని మళ్లీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని వారికి క్లాస్ తీసుకోవడం మినాహా మీరేమీ చేయలేక పోతున్నారు. అయితే తాజాగా పార్టీ తీసుకున్న ఒక నిర్ణయంతో తెలంగాణ టీడీపీ నేతల్లో కొత్త ఆశలు చిగురించాయని చెప్పచ్చు.

అదేంటంటే ఇటీవల రామలింగారెడ్డి మృతి చెందడంతో ఖాళీ అయిన దుబ్బాక ఉపఎన్నికల్లో పోటీ చేసే యోచనలో టిడిపి ఉందని చెబుతున్నారు. అభ్యర్థిగా ఇల్లెందుల రమేష్ గుప్తాని పార్టీ పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. గతంలో దుబ్బాక టిడిపి ఇన్ ఛార్జి గా పని చేసిన ఆయన ప్రస్తుతం మెదక్ పార్లమెంట్ టిడిపి ఇన్ ఛార్జి గా ఉన్నారు. గతంలో పొత్తులో భాగంగా ఈ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధి పోటీ చేసి రామలింగారెడ్డి రెడ్డి చేతిలో ఓడిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news