అల్లరి చేస్తోందని విద్యార్థిని తలపై కొట్టిన టీచర్ సంఘటన నేపథ్యంలో..విద్యార్థి పుర్రె ఎముక చిట్లింది.
తరగతి గదిలో విద్యార్థిని అల్లరి చేస్తోందని ఉపాధ్యాయుడు కొట్టడంతో బాలికకు తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో హరి, విజేతల కుమార్తె సాత్విక నాగశ్రీ (11) ఆరో తరగతి చదువుతోంది.

ఈ నెల 10న తరగతి గదిలో విద్యార్థిని అల్లరి చేస్తోందని తలపై స్కూల్ బ్యాగ్ తో హిందీ ఉపాధ్యాయుడు
కొట్టారు. తలనొప్పిగా ఉందని మూడు రోజుల నుంచి పాఠశాలకు వెళ్లకపోవడంతో.. బాలికను పుంగనూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బెంగళూరు తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు సూచించారు వైద్యులు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించగా.. పుర్రె ఎముక చిట్లినట్లు పరీక్షల్లో స్పష్టం చేశారు వైద్యులు. ఈ మేరకు సోమవారం రాత్రి స్కూల్ యాజమాన్యంపై విద్యార్థిని తల్లి, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అల్లరి చేస్తోందని విద్యార్థిని తలపై కొట్టిన టీచర్.. పుర్రె ఎముక చిట్లిన వైనం
తరగతి గదిలో విద్యార్థిని అల్లరి చేస్తోందని ఉపాధ్యాయుడు కొట్టడంతో బాలికకు తలకు తీవ్ర గాయాలు
చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటు చేసుకున్న ఘటన
స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోన్న హరి,… pic.twitter.com/Hdzgz1gTJn
— BIG TV Breaking News (@bigtvtelugu) September 16, 2025