అమిత్ షాను కలిసిన టీమిండియా న్యూ కెప్టెన్ హార్దిక్ పాండ్యా

-

ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు భారత జట్టు నూతన రథసారథి హార్దిక్ పాండ్యా, ఆయన సోదరుడు కృణాల్ పాండ్యా. హోం మంత్రి అమిత్ షా నివాసంలో వీరు భేటీ అయ్యారు. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని హార్దిక్ పాండ్యా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అమిత్ షా తన అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నాడు హార్దిక్ పాండ్యా.

అయితే శ్రీలంకతో జరగబోయే శిరీష్ లో హార్దిక్ పాండ్యా భారత టి20 జట్టుకు నాయకత్వం వహించబోయే విషయం తెలిసిందే. హార్థిక్ పాండ్యా, అమిత్ షా గుజరాత్ కి చెందిన వారు కావడమె ఈ భేటీ వెనుక ఉన్న సంబంధమని చెప్పవచ్చు. మరోవైపు హార్దిక్ పాండ్యా రాజకీయాలలోకి వస్తారనే ఊహగానాలు కూడా వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version