అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతున్న బీజేపీ…. త్వరలో ఉమ్మడి జిల్లాకు ఓ ఇంఛార్జ్

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతోంది బీజేపీ. ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాడు. రాష్ట్రంలో ఎన్నికల్లోగా బీజేపీని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే తెలంగాణలో కేంద్రం జిల్లాల వారీగా నేతల పనితీరును సమీక్షిస్తోంది. ఇప్పటికే బీజేపీ అధిష్టానం తెలంగాణ పై భారీగా ఆశలు పెట్టుకుంది. అందుకు తగ్గట్లుగానే కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రస్తుతం బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షాలు కూడా పాల్గొననున్నట్లు తెలిసింది. 

ఇదిలా ఉంటే త్వరలోనే ఉమ్మడి జిల్లాల వారీగా బీజేపీ ఇంఛార్జులను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలను జిల్లాల వారీగా ఇంచార్జులను నియమించనున్నారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఈ రకమైన వ్యూహంతోనే ముందుకు వెళ్లి గణనీయంగా తన బలాన్నిపెంచుకుంది. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో  ఈ సమయంలోనే బీజేపీని మరింతగా బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version