తెలంగాణాలో మళ్ళీ భారీగా కరోనా కేసులు.. ఏకంగా 1,481

-

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్న కరోనా కేసులు కొద్ది రోజులుగా మళ్ళీ పెరుగుతున్నాయి. అయితే రోజూ చేసే కరోనా టెస్ట్ ల కంటే చాలా మేరకు మొన్న రెండు రోజులు టెస్ట్ లు తగ్గించడంతో కేసులు కూడా భారీగా తగ్గాయి. అయితే మళ్ళీ టెస్ట్ లు పెంచడంతో కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 1,481 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,34,152 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో నలుగురు మరణించారు. ఇప్పటి వరకు 1319 మంది కరోనాతో మరణించారు.

ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 17,916 ఉన్నాయి. వారిలో 17,916 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 2,14,917 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 1,451 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 91.14% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 91.78% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.56%గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 40,081 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 41,55,597 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 279 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news