తెలంగాణా కరోనా అప్డేట్ : 1,436 కేసులు, 6 మరణాలు

-

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్న కరోనా కేసులు కొద్ది రోజులుగా మళ్ళీ పెరుగుతున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 1,436 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,22,111 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో 6 మంది మరణించారు. ఇప్పటి వరకు 1271 మంది కరోనాతో మరణించారు.

ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 22,050గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 1,98,790 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 2,154 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 89.5% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 88% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.57 %గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 41,043 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 38,30,503 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 249 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news