ఆవుని చంపింది అని పెద్ద పులి ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశారు…!

-

మధ్యప్రదేశ్ లోని బాంధవ్‌ గర్ నేషనల్ పార్క్‌ లోని బఫర్ ప్రాంతంలో దామోఖర్ రేంజ్‌లో ఒక పులి మరియు పిల్లలను చంపేశారు. శనివారం ఒక గ్రామానికి చెందిన వారు వాటిని చంపేశారు. అయితే మరణానికి గల కారణాలు ఏంటీ అనేది ఇంకా అధికారులు వెల్లడించలేదు. అయితే ఇది గ్రామస్తులు చేసిన ప్రతీకార హత్యగా చెప్తున్నారు. 10 ఏళ్ళ వయసు ఉన్న పులి దాని పిల్లలు ఈ దాడిలో మరణించాయని…

అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (ఎపిసిసిఎఫ్) జెఎస్ చౌహాన్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. పులిపై ఎటువంటి గాయం గుర్తులు లేనప్పటికీ, పిల్ల పక్కటెముకలపై చిన్న పంక్చర్ అయిన ఆనవాళ్ళు ఉన్నాయి. వాటికి పోస్టుమార్టం కూడా నిర్వహించారు. ఏమైనా విష పరీక్షా చేసారా అనే దానిపై నిర్ధారించడానికి పరీక్షల కోసం విసెరాను భద్రపరిచారు. పులికి మరో మూడు పిల్లలు ఉన్నాయని అధికారులు చెప్పారు. ఇటీవల ఒక ఆవుని ఆ పులి చంపేసింది అని, అలాగే మనుషుల మీద దాడులు చేస్తున్నాయని గుర్తించి వాటి మీద ప్రతీకారం తీర్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news