Telangana: వర్సిటీ వివాదం.. గవర్నర్ తో చర్చకు విద్యాశాఖ రెడీ

-

విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామకబోర్డు విషయమై గవర్నర్ సందేహాల నివృత్తికి విద్యాశాఖ సిద్ధమైంది. వివరణ ఇచ్చేందుకు గవర్నర్ సమయం ఇవ్వాలని రాజ్ భవన్‌ను కోరింది.  సమయం ఖరారు చేస్తే రాజ్ భవన్ వెళ్లి సందేహాలు నివృత్తి చేసేందుకు విద్యాrశాఖ మంత్రి, అధికారులు సిద్ధమయ్యారు.

విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు విషయమై కొన్ని సందేహాలు లేవనెత్తిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్… ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. విద్యాశాఖ మంత్రి, అధికారులను పంపి నివృత్తి చేయించాలని అందులో సూచించారు. సీఎంఓ కార్యాలయం నుంచి విద్యాశాఖకు సంబంధిత లేఖ చేరింది. సందేహాలు నివృత్తి చేసేందుకు సిద్ధమైన విద్యాశాఖ… సమయం ఇవ్వాలని రాజ్ భవన్‌ను కోరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version