వివేకా హత్య కేసు: సునీత రెడ్డిపై జడ్జి సీరియస్…

-

కడప మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటి ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సిబిఐ విచారణకు రాకుండా వివిధ కారణాలతో తప్పించుకుంటున్నాడని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే అంతకన్నా ముందే ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి తెలంగాణ కోర్ట్ లో పిటీషన్ వేశాడు. దీనిపైనా రోజులకు రోజులు విచారణ జరుగుతున్నా ఇంకా తుది తీర్పు ఇవ్వడం లేదు. కాగా తాజాగా హై కోర్ట్ ఈ కేసును విచారించగా ముందుగా అవినాష్ రెడ్డికి సంబంధించిన లాయర్లు తమ వాదనలు వినిపించాయి.

ఆ తర్వాత సునీత కు సంబంధించిన లాయర్ లకు అవకాశం ఇవ్వగా, అంతలోనే సునీత కోర్ట్ అనే సంగతి మరిచిపోయి ఏకంగా జడ్జి తో అవినాష్ రెడ్డి లాయర్ లకు ఎంత సమయం అయితే ఇచ్చారో.. మా లాయర్ కు కూడా అంతే సమయం ఇవ్వాలని అనడంతో ఆమెపై హై కోర్ట్ జడ్జి సీరియస్ అయ్యారు. జడ్జి మీ లిమిట్స్ లో మీరు ఉంటె మంచిదని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version