భారత్ సమ్మిట్ -2025 గురించి సీఎం రేవంత్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్లోని హెచ్ఐసీసీ వేదికగా ఏప్రిల్ 25 నుంచి 2 రోజుల పాటు ‘భారత్ సమ్మిట్ 2025’ జరిగిన విషయం తెలిసిందే.దాదాపు 100 దేశాల నుంచి 450 మంది విదేశీ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఆదివారం సీఎం రేవంత్ తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా ఆసక్తికర ట్వీట్ చేశారు.
‘తెలంగాణ వేదికగా వందకుపైగా దేశాలు, వందల ఆలోచనల సంఘర్షణలు.. లక్ష్యం ఒక్కటే ప్రపంచ ప్రజాస్వామ్యానికి ప్రాణం పోయడం. ప్రజల హక్కులలో సమానత్వాన్ని చాటడం.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిశానిర్దేశంలో అభివృద్ధిలోనే కాదు ప్రజాస్వామ్య పునరుజ్జీవనంలో సైతం ప్రపంచానికి దిక్సూచి తెలంగాణ’ అని పేర్కొన్నారు.కాగా,ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాల పరిష్కారానికి ఏకమవుతామని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థలను మరింత సమర్థంగా తీర్చిదిద్దుతామని ‘భారత్ సమ్మిట్’లో తీర్మానం చేశారు.