సిఎస్ సోమేశ్ ని కలిసిన తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్

-

సెక్రటేరియట్ లో సీఎస్ సోమేశ్ కుమార్ ని కలిశారు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ సంఘం సభ్యులు. అనంతరం తెలంగాణ లారీ ఓనర్ల సంఘం అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడులో 101 నామినేషన్లు వేస్తామని చెప్పామని.. కానీ కేటీఆర్ మాతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారని అన్నారు. అందుకే నేడు సీఎస్ తో భేటీ అయ్యామని తెలిపారు. కౌంటర్ సిగ్నేచర్, గ్రీన్ ట్యాక్స్ లాంటి వాటిపై క్లారిటీ ఇచ్చారని చెప్పుకొచ్చారు.

చాలా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారని తెలిపారు రాజేందర్ రెడ్డి. క్వార్టర్ ట్యాక్స్ కూడా రద్దు చేస్తామని చెప్పారన్నారు. మాపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవన్నారు. మాకు లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వలేదు కానీ నాలుగు రోజుల్లో జీవో ఇస్తామన్నారని తెలిపారు. కేటీఆర్ హామీతో నామినేషన్ వేయడాన్ని వెనక్కి తీసుకున్నామన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ కే మా మద్దతు ఉంటుందని తెలిపారు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version