కారుణ్య నియామకాలకు తెలంగాణ ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్

-

తెలంగాణ ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మరణించిన ఆర్టీసీ సిబ్బంది కుటుంబంలో అర్హులైన ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనల్ సర్క్యులర్ జారీ చేశారు. బ్రెడ్ విన్నర్స్ స్కీం పేరుతో సజ్జనాలు ఈ సర్క్యులర్ ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

కరోనా అలాగే ఇంధన ధరలు పెరగడం, అధికంగా ఉన్న సిబ్బందిని తగ్గించుకునే నేపథ్యంలో 2019 నుంచి కారుణ్య నియామకాలను చేపట్టలేదని ఎండి వెల్లడించారు. కానీ కారుణ్య నియామకాలు చేపట్టాలని పెద్ద ఎత్తున వినతులు వచ్చాయని సజ్జనాలు వివరించారు.

పెద్ద ఎత్తులో దరఖాస్తులు పెండింగ్ లో ఉండటంతో కార్పొరేషన్ అవసరాలు కనుగుణంగా దశలవారీగా అప్లికేషన్లను పరిగణంలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అర్హులైన డిపెండెంట్ లను డ్రైవర్ గ్రేడ్ 2, కండక్టర్ గ్రేడ్ 2, ఆర్టీసీ కానిస్టేబుల్ అలాగే శ్రామిక్ పోస్టుల్లోకి తీసుకుంటామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version