కేసీఆర్ చెయ్యి వదిలిన వారంతా శంకరగిరి మాన్యాలకు పోక తప్పదు – పువ్వాడ అజయ్

-

ఖమ్మం: జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికలలో అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. అసెంబ్లీ గేటును ఎలా తాకనివ్వరో మనం కూడా చూద్దామని అన్నారు. స్వార్థం కోసం బిఆర్ఎస్ ని బొంద పెడతామనే వారికి కేడర్ సవాల్ విసరాలన్నారు మంత్రి పువ్వాడ అజయ్.

 

ఇప్పుడు శాపాలు పెట్టేవారు అప్పుడు నన్ను గెలిపించడం కోసం కృషి చేయలేదన్నారు. బిఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తామనే వారు కొంతమంది ప్రగల్బాలు పలుకుతున్నారని.. వారు వేల కోట్ల కాంట్రాక్టులు తీసుకున్నది నిజం కాదా..? అని ప్రశ్నించారు. కాకరకాయ కూడా పంచని నాయకులు ఇప్పుడు వారు ఏదో చేస్తామని చెబుతున్నారని.. తాను ప్రజల కోసం కడుపు కట్టుకొని ఎంతో సేవ చేశానన్నారు.

అలాంటి తనను ప్రజలు ఎందుకు అసెంబ్లీకి పంపరని అన్నారు మంత్రి పువ్వాడ. నాయకుల స్వార్థం కోసం కెసిఆర్ చెయ్యి వదిలిపెట్టిన వారంతా శంకరగిరి మాన్యాలకు పోక తప్పలేదన్నారు. మూడవసారి కూడా కెసిఆర్ సీఎం అవుతాడని ధీమా వ్యక్తం చేశారు. 300, మటన్ బిర్యానీల కోసం వచ్చేవాళ్ళు బిఆర్ఎస్ కేడర్ కాదన్నారు మంత్రి.

Read more RELATED
Recommended to you

Exit mobile version