ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షల‌ హాల్ టికెట్లు విడుద‌ల‌

-

తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల హాల్ టికెట్లు విడుద‌ల అయ్యాయి. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వ‌ర‌కు ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఉద‌యం 9:30 నుంచి మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష‌లు కొన‌సాగ‌నున్నాయి.

ఈ ఏడాది 5.08 ల‌క్ష‌ల మంది విద్యార్థులు ప‌ది ప‌రీక్ష‌లు రాయ‌నున్నారు. హాల్ టికెట్ల కోసం www.bse.telangana.gov.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు. విద్యార్థులకు వారు చదివే పాఠశాలలో హాల్ టికెట్లను పొందవచ్చు. ఒకవేళ ఫీజు చెల్లించాలని.. తదితర ఇబ్బందులు ఎదుర్కొనే వారు నేరు హాల్ టికెట్ ని డౌన్ లోడ్ చేసుకొని పరీక్ష రాయవచ్చు. సాధారణ విద్యార్థులకు మార్చి 18 నుంచి 30 వరకు పరీక్షలు జరిగితే.. ఒకేషనల్ విద్యార్థులకు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరుగనున్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక బస్సుల సౌకర్యం కూడా కల్పించనున్నట్టు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version