సంగారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామానికి రూ.15 లక్షలు : సిఎం కేసీఆర్‌

-

సంగారెడ్డి జిల్లాలో ప్రతి గ్రామానికి( 699 గ్రామాలు) 15 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నాము… తాగునీటి సమస్య శాశ్వతంగా తీరిందని.. అనేక రంగాల్లో తెలంగాణ ఈ రోజు నంబర్ వన్ అని పేర్కొన్నారు. హరీష్ రావు ప్రజల కోసం తపన పడే వ్యక్తి… క్రియాశీలకంగా ఉంటాడు.. హుషారుగా ఉంటాడని కొనియాడారు.

సంగారెడ్డి, జహీరాబాద్ మునిసిపల్ లకు 50 కోట్ల చొప్పున… మిగిలిన మునిసిపాలిటీలకు 25 కోట్ల మంజూరు చేస్తున్నామని ప్రకటన చేశారు. అన్ని తండాలకు రోడ్లు… పంచాయతీ రాజ్ రోడ్లకు నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు.

నిజాం పెట్ మండల కేంద్రంగా ప్రకటిస్తున్నానని.. రాష్ట్రమే కాదు…దేశం కూడా బాగా ఉండాలి… కులాల, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని.. అన్ని వర్గాలు, కులాలు, మతాలు బాగుండాలని ప్రతి ఇంట్లో చర్చ పెట్టాలన్నారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని.. నేను పోరాటానికి బయలు దేరిన… బంగారు తెలంగాణల బంగారు భారత దేశంగా తయారు చేసుకుందామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version