తెలంగాణ‌లో నేడు కొత్త‌గా 157 క‌రోనా కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ తో పాటు ఓమిక్రాన్ ఓరియంట్ వ్యాప్తి భారీగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. నేడు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుద‌ల చేసిన క‌రోనా బులిటెన్ ప్రకారం.. గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 24,576 క‌రోనా నిర్ధార‌ణ పరీక్షలు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్షల ఫ‌లితాల్లో 154 మందికి కరోనా వైర‌స్ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. కాగ ఇంకా 1,030 క‌రోనా ఫ‌లితాలు రావాల్సి ఉంది.

దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 7,89,237 క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అలాగే ఈ రోజు కూడా రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించ‌లేదు. కాగ గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా 266 మంది బాధితులు క‌రోనా వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇంకా.. 2,607 యాక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. కాగ తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి త‌గ్గ‌డంతో ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం ఆంక్షల‌ను స‌డ‌లించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version