100 రోజుల్లోనే 16,400 కోట్లు అప్పు చేసిన రేవంత్ సర్కార్ !

-

100 రోజుల్లోనే 16,400 కోట్లు రేవంత్ సర్కార్ అప్పు చేసినట్లు ఫైర్ అయ్యారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కేసీఆర్ అప్పులు చేశాడు అని దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 100 రోజుల్లోనే 16,400 కోట్లు ఎలా అప్పు చేశారని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రైతులకు ఎకరాకు రూ.10 వేలు పంట నష్టపరిహారం ఇవ్వాలి… ప్రాజెక్టుల గేట్లు ఎత్తమంటే రాజకీయ గేట్లు ఎత్తాం అంటున్నారన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం జరిగిందని… వడగండ్లవాన, అకాల వర్షాలతో పంటలు పోయి రైతులు బాధలో ఉంటే ఒక్క మంత్రి వారికి భరోసా ఇవ్వడం లేదని తెలిపారు. గత ఏడాది అకాల వర్షాల నేపథ్యంలో పంటలు దెబ్బతింటే వికారాబాద్, వరంగల్ జిల్లాలో పంటలు దెబ్బతింటే స్వయంగా నేను, కేసీఆర్ గారు పర్యటించి ధైర్యం కల్పించాం… డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రకారం రూ. 2,000-2,500 అంచనా వేసినా కూడా రైతుకన్నా మించిన వాడు లేడని ఎకరాకు రూ.10 వేల పంట సాయం అందించాం.. ఒకే రోజు రూ. 1,300 కోట్లు విడుదల చేశాం.. తర్వాత మిగతా వాటికి అందించామని గుర్తు చేశారు. అప్పుడు ఎకరాకు రూ.10 వేలు బిచ్చం వేస్తున్నారా ? అని ఇదే రేవంత్, కాంగ్రెస్ నేతలు అన్నారని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news