అంగన్వాడీ టీచర్ల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలు పెంచుతూ శుభవార్త చెప్పింది. ఇకపై రిటైర్ అయ్యే అంగన్వాడీ టీచర్లకు రూ.2 లక్షలు అందనున్నాయి.

అదే విధంగా అంగన్వాడీ హెల్పర్లకు రూ. లక్ష ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. దీనికి ఆర్థిక శాఖ ఆమోదం తెలుపగా త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇక అటు తెలంగాణలో మరో కొత్త పథకం ప్రారంభం కానుంది. ఈ కొత్త పథకాన్నీ నేడు భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెంలో ప్రారంభించనున్నారు మంత్రి సీతక్క. కౌమార బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు ఇందిరమ్మ అమృతం పథకం నేడు భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెంలో ప్రారంభించనున్నారు మంత్రి సీతక్క.