Fake currency scam in Telangana: తెలంగాణ రాష్ట్రంలో నకిలీ నోట్లు కలకలం చోటు చేసుకుంది. తెలంగాణలోని వరంగల్ జిల్లా పర్వతగిరి ప్రాంతంలో నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. దుర్గశ్రీ అనే మద్యం షాప్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి నకిలీ నోట్లతో మద్యం కొనుగోలు చేసినట్టు సమాచారం.

ఆ నోట్లను వైన్ షాప్ సిబ్బంది బ్యాంకులో జమ చేయడానికి ప్రయత్నించగా.. అవి నకిలీ రూ.500, రూ.100 నోట్లుగా గుర్తించినట్టు బ్యాంకు అధికారులు వెల్లడించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక తెలంగాణలోని వరంగల్ జిల్లా పర్వతగిరి ప్రాంతంలో నకిలీ నోట్లు కలకలం సృష్టించిన సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.