పోలీస్ కమిషనర్ పేరిట సైబర్ మోసం..!

-

పోలీస్ కమిషనర్ పేరిట 80 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగినిని మోసం చేసారు సైబర్ చీటర్స్. 80 ఏళ్ల సదరు వృద్ధ మహిళ మొబైల్ నెంబర్ పై హైదరాబాద్ నుండి డ్రగ్స్ ఢిల్లీ కు పర్సల్ అవుతున్నాయంటూ సైబర్ నేరగాళ్లు మొదట అఆమేను భయపెట్టారు. అయితే సదరు వృద్ధురాలిపై కేసును నమోదు కాకుండా ఉండాలంటే… ఆమె అకౌంట్ లో ఉన్న నగదు మొత్తం తమకు ట్రాన్స్ఫర్ చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు.

అయితే ఆర్బీఐ నిబంధనల ప్రకారం వేరిఫికేషన్ చేసిన తర్వాత డబ్బులు తిరిగి ఆమె అకౌంట్ కు పంపిస్తామంటూ చెప్పారు సైబర్ నేరగాళ్లు. దాంతో పోలీస్ కమిషనర్ నుండే ఫోన్ వచ్చిందనుకుని నమ్మిన బాధిత వృద్ధురాలు.. ఆమె అకౌంట్ లో ఉన్న 22 లక్షలు సైబర్ చీటర్స్ అకౌంట్ కు పంపింది. అనంతరం ఈ విషయాన్ని వృద్ధురాలు తన కొడుకుకు చెప్పడంతో.. జరిగిన మోసాన్ని గ్రహించిన ఆమె కొడుకు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news