తల్లితో ఎఫైర్ పెట్టుకుని కూతురికి కడుపు చేశాడు ఓ బాబాయ్. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని అమ్మ ఆస్పత్రిలో శనివారం అబార్షన్ కేసు విచారణలో దారుణాలు వెలుగు చూడటం జరిగింది. నర్సింహులపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు విభేదాలతో కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు.. భార్య తన కూతురితో కలిసి భువనగిరి జిల్లా ఘట్కేసర్ ప్రాంతంలో నివాసముంటోందని సమాచారం.

ఈ క్రమంలోనే ఆమెకు మరిది వరుసయ్యే రాము అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది.. తల్లిని వలలో వేసుకున్న దుర్మార్గుడు ఈడుకొచ్చిన కూతురి కన్నేశాడు.
తల్లి ప్రొద్బలంతో దుర్మార్గుడు పలుమార్లు అత్యాచారం చేయడంతో గర్భం దాల్చింది బాలిక. ఇక ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో తెలియక సదరు బాలిక కొద్దిరోజుల క్రితం అమ్మమ్మకు తెలిపింది. ఈ విషయం గుట్టు చప్పుడు కాకుండా తొర్రూరులోని అమ్మ ప్రైవేటు ఆస్పత్రిలో బాలికకు అబార్షన్ నిర్వహించారు. బాలికకు అబార్షన్ జరిగిన విషయం చైల్డ్ లైన్కు ఫిర్యాదులు అందడంతో అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో తల్లి, ఆమె ప్రియుడి దారుణాలు వెలుగులోకి వచ్చాయి.