సారం లేని భూమి.. విద్య లేని జీవితం ఒక్కటే : మంత్రి సీతక్క

-

సారం లేని భూమి.. విద్య లేని జీవితం ఒక్కటేనని  మంత్రి సీతక్క పేర్కొన్నారు. హైదరాబాద్ లో సాప్ట్ వేర్ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు నిర్వహించిన సెమినార్ లో పాల్గొని మాట్లాడారు. ఏసీ గదులకే పరిమితం కాకుండా.. అప్పుడప్పుడు అడవులకూ వెళ్లాలని మంత్రి సీతక్క ఐటీ కంపెనీలకు, ఉద్యోగులకు పిలుపునిచ్చారు. స్వచ్ఛమైన గాలి పీల్చడం వల్ల 30 శాతం ఆయుష్షును పెంచుకోవచ్చని వెల్లడించారు. ఏజెన్సీ ఏరియాల డెవలప్ మెంట్ కి సాఫ్ట్ వేర్, కార్పొరేట్ సంస్థలు సహకరించాలని కోరారు. ఒక్కొ కంపెనీ ఒక్కొ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గిరిజన ప్రాంతాల్లో డిజిటల్ ఎడ్యుకేషన్ కి ప్రయారిటీ ఇవ్వాలన్నారు. దేశ ముఖచిత్రాన్ని మార్చేది
విద్యనేనని, సమాజంలో ఇంకా అంతరాలు ఉన్నాయని, వాటిని తొలగించాల్సిన అవసరం
ఉన్నదన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యా అవకాశాలు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా
ఉన్నాయని.. దీని వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారని  తెలిపారు. అందుకే విద్యలో సమానత్వ సాధనను సృష్టించాలని, హైదరాబాద్లోని ఎడ్యుకేషను జిల్లాల్లోనూ అందించాలని ఆకాక్షించారు. అచ్చంపేట, ఆదిలాబాద్, ములుగు, భద్రాచలం వంటి అటవీ ప్రాంతాల్లో విద్యా వ్యాప్తికి, డిజిటల్ ఎడ్యుకేషన్కు కృషి చేయాలని సాఫ్ట్వేర్ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలను కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news