గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తప్పిన ప్రమాదం

-

ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కి కాస్తలో ప్రమాదం తప్పింది. శనివారం రోజు ఆయన కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. సూర్యపేట జిల్లా చివ్వెంల మండలం ఖాసీంపేట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వల్లభనేని వంశీ తన కాన్వాయ్ లో విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్లేందుకు బయలుదేరారు. మార్గ మధ్యలో కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.

ముఖ్యంగా కాన్వాయ్ లోని చివరి రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదం నుంచి ఎమ్మెల్యే వంశీ సురక్షితంగానే బయటపడ్డారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ రెండు వాహనాలు స్వల్పంగా దెబ్బ తిన్నాయి. ఎమ్మెల్యే వంశీ మోహన్ మిగిలిన వాహనాలతో కలిసి హైదరాబాద్ కి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే వంశీకి ప్రమాదం తప్పిందని అందరూ చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news