సంగారెడ్డిలో దారుణం…6 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకుల రేప్ !

-

తెలంగాణ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఆరేళ్ల బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఇవాళ వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో ఆరేళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

A six-year-old girl was rped by three youths under the influence of alcohol

ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను పొదల్లోకి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు ఈ ముగ్గురు కామాంధులు. అయితే… దీనిపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… వెంటనే కేసు బుక్‌ చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news