కరీంనగర్ లో ఘోరం.. ఐదు ఇండ్లలో పేలిన గ్యాస్ సిలిండర్లు..!

-

కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం సుభాష్ నగర్ లోని పూరీ ఇళ్లలో భారీగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి దాదాపు 5 ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ పేలుడు కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. ఈ విషయం తెలిసిన వెంటనే ఘటన స్థలాన్ని చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

మంటలు ఇంకా అదుపులోకి రాన్నట్టు తెలుస్తోంది. అయితే ఆ గుడిసెల్లో నివసించే కార్మికులందరూ మేడారం జాతరకు కుటుంబ సమేతంగా తరలి వెళ్లడంతో పెన ప్రమాదము తప్పింది. వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చి గత 20 ఏళ్లుగా కార్మికులు ఆ పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్నట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news