సన్న బియ్యం లబ్ధిదారులకు మరో శుభవార్త చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈనెల చివరి వరకు.. రేషన్ దుకాణాలలో సన్న బియ్యం పంపిణీ కొనసాగుతుందని తెలంగాణ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ వేగంగా సాగుతోందని ఈ సందర్భంగా వెల్లడించారు ఉత్తంకుమార్ రెడ్డి.

మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ… ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు సంగం సరఫరా చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు 62 శాతం మంది లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ పూర్తయింది అన్నారు. మిగిలిన లబ్ధిదారులు.. కూడా ఈనెల చివరి వరకు రేషన్ షాపుల వద్ద సన్న బియ్యం తీసుకోవచ్చని స్పష్టం చేశారు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.