ప్రెస్ మీట్ తర్వాత పోలీసులు కండ్లు కప్పి నిందితుడు పరార్..!

-

ప్రెస్ మీట్ తర్వాత పోలీసులు కండ్లు కప్పి ఓ నిందితుడు జంప్ అయ్యాడు. అయితే నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో ఒక వ్యక్తి వద్ద రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ఈ విషయంపై ఎఎస్పీ కార్యాలయంలో భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఇందులో ఏఎస్పీ నిందితున్ని రిమాండ్ కు తరలిస్తున్నట్లు వెల్లడించాడు. కానీ ఆ తర్వాత కొద్ది సేపటికే పోలీసులు కండ్లు కప్పి నిందితుడు పరార్ అయ్యాడు.

అయితే పోలీస్ స్టేషన్ నుంచి పరారైన నిందితుడి కోసం పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం చేసారు పోలీసులు. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. పట్టణంలోని అన్ని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నాయి పోలీస్ టీంలు. అయితే అరెస్టు చేసామని మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అరగంటలోనే పోలీస్ స్టేషన్ నుంచి నిందితుడు పారిపోవడం అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news