HYD పోలీసులకు అక్బరుద్దీన్‌ మాస్‌ వార్నింగ్‌.. !

-

HYD పోలీసులకు అక్బరుద్దీన్‌ మాస్‌ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రయానగుట్ట నియోజకవర్గం సంతోష్ నగర్ పిఎస్ పరిధిలో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ నిన్న ప్రచారం నిర్వహించారు. ఇంతలో అక్కడికి వచ్చిన సంతోష్ నగర్ ఇన్స్పెక్టర్ పి. శివచంద్ర ప్రచార సమయం అయిపోయింది. ఇక ప్రసంగం ముగించాలని అక్బరుద్దీన్ ఓవైసీకి చెప్పారు.

Akbaruddin mass warning to HYD police
Akbaruddin mass warning to HYD police

దీంతో ఒక్కసారిగా అక్బరుద్దీన్ కు కోపం వచ్చింది. ప్రచార సమయానికి ఇంకా ఐదు నిమిషాలు ఉందని, ముందే ప్రచారాన్ని ఎలా ఆపుతారంటూ ఇన్స్పెక్టర్ కన్నెర్ర చేశారు. అంతేకాకుండా స్టేజ్ మీద నుంచి దిగి సీరియస్ గా ఇన్స్పెక్టర్ శివచంద్రవైపు వెళ్లారు. అంతేకాకుండా మాస్ వార్నింగ్ ఇచ్చారు. మీ దగ్గర గడియారం లేకపోతే నా వాచ్ ని మీకు ఇస్తా టైం చూసుకోండంటూ ఊగిపోయారు. అంతేకాకుండా తనపై తూటాలు, కత్తులతో దాడులు జరిగాయని…. అంతమాత్రాన అలసిపోయానని అనుకుంటున్నారా అంటూ ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news