జగన్ లాంటి బిడ్డను ఏ తల్లి కనాలి అని అనుకోదు – టీడీపీ నేత అనిత

-

టీడీపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత షాకింగ్‌ కామెంట్స్ చేశారు. విశాఖలో ఇవాళ మీడియాతో టీడీపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ.. సీఎం జగన్ కు దమ్ముంటే రానున్న ఎన్నికలలో క్లిన్ చిట్ తో నామినేషన్ వెయ్యాలని సవాల్‌ చేశారు. పేద ముఖ్యమంత్రి కనుకే రూ. 430 కోట్లు పెట్టి విశాఖలో జగన్ ఇల్లు కడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

మీ బిడ్డకు పత్రికలు, టీవీలు, సోషల్ మీడియా లేదని ప్రతి మీటింగ్ లో జగన్ అబద్ధాలు చెబుతున్నారని..సాక్షి ఛానల్, పేపర్ ఎవరివో సీఎం చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగతి పబ్లికేషన్ లో పెట్టుబడులలో క్విడ్ ప్రోకో జరిగిందని విమర్శలు చేశారు. నష్టాలలో ఉన్న జగతి పబ్లికేషన్ కు 1,246 కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. సీఎం జగన్ లాంటి బిడ్డను ఏ తల్లి కనాలి అని అనుకోదని సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థల మేనేజ్ చేస్తూ పరిపాలన సాగిస్తున్న జగన్ కు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news