‘రేవంత్‌రెడ్డి ఆరెస్సెస్‌ మనిషి’ – అక్బరుద్దీన్‌ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు

-

‘రేవంత్‌రెడ్డి ఆరెస్సెస్‌ మనిషి’ అంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మరోసారి రేవంత్ రెడ్డిపై విమర్శల దాడిచేశారు. ఆయన ఆరెస్సెస్ మనిషి అన్నారు. రాహుల్ పక్కనే కాకి నిక్కర్ వేసుకుని ఉన్న వ్యక్తి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పాతబస్తీ బండ్లగూడలో… ఫాతిమా ఓవైసీ పీజీ కాలేజీ క్యాంపస్ లో ప్రసంగించారు అక్బరుద్దీన్ ఓవైసీ.

బిజెపికి తెలంగాణలో సీన్ లేదని తెలిసిపోవడం వల్ల కాంగ్రెస్తో ఆర్థిక ఒప్పందం కుదుర్చుకున్నారని…. అందులో భాగంగానే ఆరెస్సెస్ వ్యక్తిని తీసుకువచ్చి పిసిసి చీఫ్ ని చేశారన్నారు అక్బరుద్దీన్. ఇప్పుడు ఆరెస్సెస్ తోపాటు… వీహెచ్పీ కూడా రేవంత్ సీఎం కావడం కోసం పనిచేస్తున్నాయన్నారు. తన మాటలు తప్పైతే రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలన్నారు. మా తాత ముత్తాతలు హిందూస్తాన్లో పుట్టారు, రాహుల్ గాంధీ మీ అమ్మమ్మ ఎక్కడ పుట్టింది? అంటూ ఫైర్‌ అయ్యారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ.

Read more RELATED
Recommended to you

Latest news