కాంగ్రెస్ లో గెలిచినవారంతా మళ్ళీ బీఆర్ఎస్ లోకే వెళతారు – బండి సంజయ్

-

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వాళ్ళు తిరిగి మళ్ళీ బిఆర్ఎస్ పార్టీలోనే చేరతారని అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బిజెపి చీఫ్ జేపీ నడ్డా హైదరాబాద్ కి చేరుకున్న సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికి, జెపి నడ్డాతో భేటీ అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అనుకుంటే కాదని.. ప్రజలు అనుకుంటేనే గెలుస్తారని అన్నారు. బిఆర్ఎస్ – కాంగ్రెస్ ఒక్కటేనని మరోసారి ఆరోపించారు.

కాంగ్రెస్ లోని 30 మంది నేతలకు కేసీఆర్ ప్రతీ నెల పాకెట్ మనీ ఇస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బిజెపి గెలవకూడదని కేసీఆర్ కోరుకుంటున్నాడని.. కాంగ్రెస్ లో గెలిచినా ఆయన వద్దకే వస్తారని అనుకుంటున్నాడని విమర్శించారు. అందుకే బీఆర్ఎస్ వీక్ ఉన్నచోట 30 మంది కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్ ఖరారు చేశాడని.. వారికి డబ్బులు కూడా ఆయనే భరిస్తానని చెప్పాడని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version