ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మళ్లీ అలుగుబెల్లి నర్సిరెడ్డినే..!

-

ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి 2025 మార్చిలో జరగనున్న ఎన్నికల్లో యుటీఎఫ్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డినే
మరోసారి బరిలో నిలపాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్  రాష్ట్ర
కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఈ మేరకు అధికారికంగా
నిర్ణయం తీసుకుంది. నర్సిరెడ్డి గత ఐదున్నర సంవత్సరాలుగా శాసన మండలి సభ్యునిగా
విద్యారంగం అభివృద్ధికి, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ప్రశంసనీయమైన కృషి చేశారని ఈ
సందర్భంగా రాష్ట్ర కమిటీ పేర్కొంది.

వివిధ యాజమాన్యాల పరిధిలోని ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలతో పాటు వివిధ వర్గాల ప్రజాసమస్యలను కౌన్సిల్ లో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేశారు అని పేర్కొంది.  ఆయన సేవలకు గుర్తింపుగా మరొక సారి శాసన మండలి అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లుగా రాష్ట్ర కమిటీ ప్రకటించింది. టీఎస్ యూటీఎఫ్ ప్రకటించిన ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిని ప్రభుత్వ జూనియర్ కళాశాలల, జూనియర్ లెక్చరర్స్ సంఘం, మోడల్ స్కూల్ సంఘం, పాలిటెక్నిక్ కళాశాలల సంఘం, 5 రకాల గురుకుల ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ప్రకటించాయి.

Read more RELATED
Recommended to you

Latest news