శంషాబాద్ కి చేరుకున్న అమిత్ షా

-

కేంద్ర మంత్రి అమిత్ షా కాసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటెల, వివేక్, విజయశాంతి, రఘునందన్, బూర నర్సయ్య స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన చేవెళ్ల సభకు బయలుదేరారు అమిత్ షా.

చేవెళ్లలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు అమిత్ షా. చేవెళ్లలోని కేవిఆర్ మైదానంలో బిజెపి విజయసంకల్ప సభను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ పై బిజెపి ప్రత్యేక దృష్టి సారించింది. ఇక అమిత్ షా రాక నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పలుమార్గాలలో ఆంక్షలు విధించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version