తెలంగాణాలో మరో దారుణం… భార్యను కొట్టి చంపడం భర్త…!

-

హైదరాబాద్ నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని రెహమత్ నగర్ లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య తనకు చెప్పకుండా పుట్టింటికి వెళ్లి వచ్చిందని భర్త అతికిరాతకంగా దాడి చేశారు. ఆ దాడిలో భాగంగా తన భార్య మరణించింది. నరసింహ అనే వ్యక్తి తన మొదటి భార్య వదిలివేయడంతో గత ఏడు సంవత్సరాల క్రితం సోని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.

crime
crime

అయితే సోనీ తనకు చెప్పకుండా పుట్టింటికి వెళ్లిందని తనపై చితకబాదాడు. ఆ దాడిలో సోనీ తీవ్ర గాయాల పాలైంది. వెంటనే స్థానికులు సోనిని చూసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు వెల్లడించారు. దీంతో నరసింహాని పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news