సింగోటం రాము కేసులో మరో ట్విస్ట్‌..వ్యభిచారం చేయించిన తల్లికూతుర్లు !

-

హైదరాబాద్ యూసఫ్ గూడ లో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దారుణ హత్య చోటు చేసుకుంది. యూసఫ్ గూడా లక్ష్మీనరసింహనగర్లో దుండగులు స్థిరాస్తి వ్యాపారి సింగోటం రాము మర్మంగాలు కోసి కత్తుల తో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. ఇక ఈ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. బోరబండ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ తో సహా ఐదుగురు నిందితులు లొంగిపోయారు. ఆంధ్రప్రదేశ్‌ తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన హిమాంబి, ఆమె కూతురు…ట్రాప్‌ చేసి మరీ… సింగోటం రాము చంపేశారు.

అయితే.. ఈ కేసులో తల్లీ కూతుర్ల భాగోతాలు తవ్వే కొద్ది బయటపడుతున్నాయి. తల్లి హిమాంబి పై 5 ఎఫ్ఐఆర్‌లు నమోదు ఇప్పటికే ఉన్నాయి. 2017 లో షేక్ సన అనే అమ్మాయితో వ్యభిచారం చేయిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన హిమాంబి..2018లో రేణుక అనే అమ్మాయితో వ్యభిచారం చేయించి అరెస్టయింది. 2020లో జూబ్లీహిల్స్ వెంకటగిరిలో వ్యభిచారం చేస్తుండగా కూడా తల్లి హిమాంబిని పట్టుకున్నారు పోలీసులు. 2017 లో విష్ణుకాంత్ అనే వ్యక్తి నుండి బ్లాక్మెయిల్ చేసి మూడు లక్షలు లాగింది హిమాంబి. 2019లో తన కూతురు నసీమాను రాజు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడంటూ తప్పుడు ఫిర్యాదు చేసిన హిమాంబి….కూతురుతో కలిసి ఇతర అమ్మాయిలను వ్యభిచారం చేయిస్తోందని పోలీసులు తేల్చారు.

Read more RELATED
Recommended to you

Latest news