ఇవాళ హైదరాబాద్‌కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

-

l ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం దిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం ఆయన హైదరాబాద్కు రానున్నారు. జులై 6వ తేదీ శనివారం రోజున తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో విభజన సమస్యలపై చర్చించేందుకు ఆయన హైదరాబాద్‌ రానున్నారు.

ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. “నిజం గెలిచింది”, జైతెలుగుదేశం, వెల్‌కమ్‌ టు సీబీఎన్ పేరుతో ఫ్లెక్సీలు నగరంలో దర్శనమిస్తున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కరించుకోవాల్సిన అంశాలపై శనివారం ప్రజాభవన్‌లో ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకోనున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని బేగంపేటకు చంద్రబాబు చేరుకోనున్నారు. అక్కడి నుంచి చంద్రబాబు నివాసం వరకు 50 కార్లు, 150 బైక్‌లతో టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించనున్నారు. 300 మందికి మించి ర్యాలీలో పాల్గొనవద్దని సూచించిన పోలీసులు. డీజేలు, పేపర్‌ స్ప్రే గన్స్‌ వాడొద్దని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఈ ర్యాలీకి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news