రేపు బీఆర్ఎస్ లోకి ఏపీ నేతలు

-

దేశవ్యాప్తంగా భారత రాష్ట్ర సమితిని బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీలోకి చేరికలను మొదలు పెట్టేశారు. రేపు టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు ఏపీకి చెందిన పలువురు నేతలు. మాజీ మంత్రి రావెల కిషోర్, తోట చంద్రశేఖర్, పార్థసారథి, తదితర నేతలు రేపు మధ్యాహ్నం కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది.

టిఆర్ఎస్ నుండి బిఆర్ఎస్ గా మారినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ లో కూడా తన కార్యకలాపాలను చురుకుగా కొనసాగిస్తుంది బిఆర్ఎస్. ఇతర పార్టీల నేతలు, అసంతృప్త నేతలు, మాజీ రిటైర్డ్ అధికారులను బిఆర్ఎస్ లో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు కొంతమంది బిఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version