హిందువులందరూ కళ్ళు తెరిచి… కమలం పువ్వుకు ఓటు వేయాలి – ధర్మపురి అర్వింద్

-

హిందువులందరూ కళ్ళు తెరిచి… కమలం పువ్వుకు ఓటు వేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు. జగిత్యాల జిల్లాలో ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ…కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 తిరిగి తెస్తామని అంటున్నారు జీవన్ రెడ్డి ఏమి సమాధానం చెప్తారని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు.

Aravind on cm revanth reddy

యూనిఫాం సివిల్ కోడ్ మీద మీ స్టాండ్ ఎంటి సిఏఏ మీద మీ అభిప్రాయం ఏంటని నిజామాబాదు ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ని ప్రశ్నించిన ఎంపీ అరవింద్.. రాములోరి గుడి నిర్మాణం స్వాగతిస్తారని జీవన్ రెడ్డి నీ అడిగితే ఎలాంటి సమాధానం లేదని ముస్లింల మద్దతు కోసం హిందువులను తొక్కుతావని ఎంపీ అరవింద్ ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ పార్టీ చరిత్ర చెత్తని కాంగ్రెస్ కి ఓట్ వేస్తే మన హిందువులకు చిప్ప చేతికి వస్తుందన్నారు. పిల్లలకు చదవడానికి కాలేజీలు ఉండవు, బ్రతకడానికి ఉపాధి ఉండదని ఇప్పటికైనా హిందువులు అందరూ కళ్ళు తెరిచి కమలం పువ్వుకు ఓటు వేయాలని కోరారు ధర్మపురి అర్వింద్.

Read more RELATED
Recommended to you

Latest news