తెరుచుకోలేదని ఏకంగా ఏటీఎంను ఎత్తుకెళ్లిన దొంగలు

-

ఏటీఎం చోరీకి యత్నించిన దుండగులు అది తెరుచుకోకపోవడంతో ఏకంగా యంత్రాన్నే ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుందలో చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీనిపై సు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ, బిచ్కుంద సీఐ నరేష్‌ తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున నలుగురు దొంగలు క్వాలిస్‌ వాహనంలో బిచ్కుందకు వచ్చి ఎస్బీఐ బ్యాంకు పక్కనున్న ఏటీఎంలో చోరీకి యత్నించారు. ఏటీఎం తెరుచుకోకపోవడంతో దాన్ని తాళ్లతో తమ వాహనానికి కట్టి లాగారు. అద్దాల తలుపును ధ్వంసం చేసి ఏటీఎంను తమ వాహనం వెనుకభాగంలో ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. దొంగిలిస్తున్న సమయంలో సైరన్‌ మోగడంతో అప్రమత్తమైన బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. కానీ వారు సంఘటనా స్థలానికి చేరుకొనేలోగా దొంగలు పారిపోయారు. ఏటీఎంలో రూ.3.97 లక్షల నగదు నిల్వ ఉన్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version