ములుగులో దారుణం.. అంగన్ వాడి టీచర్ హత్య..!

-

అంగన్ వాడీ టీచర్ దారుణ హత్యకు గురైన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాటాపురం గ్రామానికి చెందిన సుజాత ఊళ్లో అంగన్వాడీ టీచర్ విధులు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం డ్యూటీ ముగియగానే తన స్వగ్రామం ఏటూరు నాగారానికి పయనమైంది.

బుధవారం ఉదయం తాడ్వాయి సమీపంలో అటవీ ప్రాంతంలో కొందరు కూలీ పనుల కోసం వెళ్లగా అక్కడ సుజాత మృతదేహాం కనిపించింది. దీంతో షాక్ గురైన వారంతా వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుజాత మెడకు గట్టిగా స్కార్స్లో చుట్టి ఉరేసి హతమార్చినట్లుగా గుర్తించారు. అదేవిధంగా సుజాత ఒంటిపై ఉన్న 4 తులాల బంగారం, సెల్ఫోన్ కూడా దుండగులు ఎత్తుకెళ్లారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version