ఇక్ఫాయ్ యూనివర్సిటీలో దారుణం.. విద్యార్థిని పై యాసిడ్ దాడి..!

-

ఈ మధ్య కాలంలో విద్యార్థినిలపై అఘాయిత్యాలు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కళాశాలల్లో కొంత మంది ర్యాగింగ్ కు పాల్పడితే.. మరికొందరూ నమ్మించి అత్యాచారం చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. తాజాగా ఓ యాసిడ్ దాడి సంఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. హైదరాబాద్ నగరంలోని ఇక్ఫాయ్ యూనివర్సిటీలో దారుణం చోటుచేసుకుంది. లేఖ్య అనే విద్యార్థినిపై తోటి విద్యార్థులే యాసిడ్ దాడికి పాల్పడ్డారు. కాలేజీ మైదానంలో, గేటు బయటో, ఎవరూ లేని సమయంలో క్లాస్ రూమ్లో అనుకుంటే పొరపాటే. ఏకంగా కాలేజీలో జరుగుతున్న వేడుకలో ఈ దాడికి పాల్పడ్డారు.

అయితే కొందరు విద్యార్థులు రంగు నీళ్లకు బదులు బకెట్లో యాసిడ్ నింపారు. రంగు నీళ్లే అనుకొని విద్యార్థులు తోటి విద్యార్థిని లేఖ్య పై యాసిడ్ పోశారు. దీంతో లేఖకు తీవ్ర గాయాలు అయ్యారు. వెంటనే స్పందించిన కాలేజీ యాజమాన్యం ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది.  విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version