కారు బోల్తా పడి బీ ఫార్మాసీ విద్యార్థి మృతి

-

స్నేహితులందరూ కలిసి విహార యాత్రకు వెళ్లి అంతా అక్కడ సరదాగా గడుపుదాం అనుకున్నారు. అంతలోనే అది విషాదంగా ముగిసింది. నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీ వద్ద కారు బోల్తా పడిన ఘటనలో జి.రాఘవేందర్ గౌడ్(23) అనే బీ ఫార్మసీ విద్యార్థి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు.

వివరాల్లోకి వెళ్లితే.. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ లోని బ్రిలియంట్ కళాశాలలో బీ ఫార్మసీ చదవుతున్న రాఘవేందర్ గౌడ్ తో పాటు మరో 10 మంది ఫ్రెండ్స్ రెండు కార్లలో హైదరాబాద్ నుంచి వైజాగ్ కాలనీకి విహారయాత్రకు వచ్చారు. అక్కడే భోజనం చేశారు. తిరిగి కార్లలో హైదరాబాద్ కి వస్తుండగా.. వైజాగ్ కాలనీ సమీపంలోని మూలమలుపు వద్ద రాఘవేందర్ గౌడ్ నడుపుతున్న కారు బోల్తా పడింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి స్వగ్రామం గద్వాల. అదే కారులో ప్రయాణిస్తున్న సంగారెడ్డికి చెందిన ఎం.డీ. సోహైల్, సుశీల్, హుజూర్ నగర్ కి చెందిన మహేష్, కొత్తగూడెంకు చెందిన కిరణ్ లు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news