హరీశ్ రావు సమక్షంలో BRS పార్టీలో చేరిన బాబుమోహన్ కొడుకు

-

ఆందోల్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాబు మోహన్ కి షాక్ ఇచ్చారు ఆయన తనయుడు ఉదయ్ బాబు మోహన్. సిదిపేటలో మంత్రి హరీశ్ రావు సమక్షంలో BRS పార్టీలో చేరారు బాబుమోహన్ కొడుకు ఉదయ్ బాబు మోహన్. ఉదయ్ బాబు మోహన్ తో పాటు, ఆందోల్, జోగిపేట మున్సిపల్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ, అందోల్ మండల ప్రెసిడెంట్ నవీన్ ముదిరాజ్, చౌటకుర్ మండల ప్రెసిడెంట్ శేఖర్, ఇతర బిజెపి నాయకులు పార్టీలో చేరారు.

Babu Mohan's son joined the BRS party in the presence of Harish Rao
Babu Mohan’s son joined the BRS party in the presence of Harish Rao

ఇది ఇలా ఉండగా, బాబు మోహన్ ఈ ఎన్నికల్లో ఆందోల్ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. టికెట్ దక్కలేదని, అయితే ఆందోల్ నియోజకవర్గం టికెట్ ను ఉదయబాబు ఆశించారు. అది తనకు కాకుండా తండ్రికి దక్కడంతో ఆయన ఆగ్రహం చెంది బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తండ్రికి టికెట్ ఇస్తే తనయుడికి ఆగ్రహం ఏంటని ఉదయ్ పై బాబు మోహన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news