Balmuri Venkat’s followers vandalized the police vehicle: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ అనుచరులు దౌర్జన్యానికి దిగారు. పోలీస్ వాహనం ధ్వంసం చేశారు బల్మురి వెంకట్ అనుచరులు. వామపక్ష విద్యార్థి సంఘాల రాజభవన్ ముట్టడిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/07/Balmuri-Venkats-followers-vandalized-the-police-vehicle.jpg)
రాజ్ భవన్లో గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి సమావేశం జరుగుతుండగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులతో రాజ్ భవన్ కు వచ్చారు NSUI విద్యార్థి నాయకులు. ఈ సందర్భంగా వారిని అరెస్టు చేస్తుండగా పోలీసుల వాహనం అద్దాలు ధ్వంసం చేశారు NSUI విద్యార్థి నాయకులు.
ఇక అటు ఎమ్మెల్యే పల్లా, రాకేష్ రెడ్డిలు అరెస్ట్ అయ్యారు. గాంధీ హాస్పిటల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ను పరామర్శించేందుకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డిలను అడ్డుకున్నారు పోలీసులు.