కేసీఆర్ బిడ్డ వలన తెలంగాణ సమాజం తల దించుకునే పరిస్థితి – బండి సంజయ్

-

కేసీఆర్ బిడ్డ వలన తెలంగాణ సమాజం తల దించుకునే పరిస్థితి ఉందని తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబానికి ఏ ఆపద వచ్చినా… తెలంగాణ సమాజం అంటారు.. ఆ కుటుంబానికి ఆపద వచ్చినప్పుడే తెలంగాణ సమాజం గుర్తుకు వస్తుందన్నారు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ బిడ్డ వలన తెలంగాణ సమాజం తల దించుకునే పరిస్థితి అని.. కేసీఆర్ బిడ్డ లంగ దందా దొంగ దందా చేసి, ఇప్పుడు తెలంగాణ సమాజం తలవంచదు అంటే నవ్వొస్తోందని వెల్లడించారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఉందని మాతో సహా స్వచ్ఛంద సంస్థలు, వివిధ పార్టీలు ఆరోపించాయి.. బీజేపీ కి దర్యాప్తు సంస్థలకు సంబంధమే లేదని విమర్శలు చేశారు. తప్పు చేసిన వారిపై చట్టప్రకారం దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకుంటాయి.. లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం పై కేసీఆర్, కేటీఆర్ ఇప్పటికీ ఎందుకు స్పందించడం లేదు అన్నారు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బిడ్డను కాపాడుకునేందుకు కేసీఆర్ కొత్తకొత్త డ్రామాలు.. కేసీఆర్ కుటుంబం చేతిలో ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరని అగ్రహించారు. కేసీఆర్ బిడ్డ కవిత చేసిన దుర్మార్గపు చర్యల వలన ప్రజలు ఛీత్కరించుకునే పరిస్థితి అని, దొంగే.. దొంగ దొంగ అన్నట్టు కవిత వ్యవహారం ఉంది.. BRS పార్టీలో ఎంతమంది మహిళలకు స్థానం కల్పించారు? అని ఫైర్ అయ్యారు. BRS పార్టీలో తొలి కేబినెట్ లో మహిళా మంత్రే లేరు.. మహిళ దినోత్సవం ను జరిపే అర్హత BRS పార్టీకి లేదని మండిపడ్డారు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version