బీజేపీ అధికారంలోకి వస్తే..1వ తేదీకే జీతాలు – బండి సంజయ్

-

బీజేపీ అధికారంలోకి వస్తే….ఫస్ట్ తారీఖునే ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలిస్తామని ప్రకటించారు బండి సంజయ్‌. నెలరోజుల్లోనే పెండింగ్ డీఏలన్నీ చెల్లిస్తామని.. పీఆర్సీని నియమిస్తాం… 317జీవోను సవరిస్తామన్నారు. కేబినెట్ లో పీఆర్సీసహా ఉద్యోగుల సమస్యలపై ఎందుకు చర్చించలేదు ? అని అగ్రహించారు.

తెలంగాణ రాష్ట్రంలోని అప్పులన్నీ తీరాలంటేనే బీజేపీతోనే సాధ్యమని.. బీజేపీ లేకుంటే ఉద్యోగులకు 3 నెలలకోసారి జీతాలిచ్చే పరిస్థితి ఉందన్నారు. ఒక్కో ఉపాధ్యాయ సంఘానికి రూ. 5 కోట్ల ఇచ్చి ఓట్లను కొనేందుకు యత్నం అని.. ఒక్కో ఓటుకు రూ.20 వేలిస్తున్నట్లు ప్రచారం చేస్తూ టీచర్ గౌరవాన్ని దెబ్బతీస్తున్న బీఆర్ఎస్.. పొరపాటున బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ అహంకారం తలకెక్కడం ఖాయమని తెలిపారు. ఓటేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండని… ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ సత్తా చూపండి.. కేసీఆర్ చెంప చెళ్లుమన్పించండని కోరారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news